సావిత్రి స్మృతిలో
నిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో “మహానటి సావిత్రి” అన్న పుస్తకం కొన్నాము, రెండొందల రూపాయలు పెట్టి. సావిత్రిని గురించి రకరకాల వ్యక్తులు రాసిన రకరకాల వ్యాసాల సంకలనం. సంకలనకర్త - హెచ్.రమేష్బాబు. పుస్తకం ఒక్కోపేజీ చదువుతూ ఉంటే, మనసంతా అదోలాగా అయిపోయింది. అదేపనిగా చదివితే కళ్ళలోంచి నీళ్ళొస్తాయేమో అన్న అనుమానం కొద్దీ అనేక విరామాల మధ్య చదివాను పుస్తకాన్ని. సావిత్రి జీవితంలోని విషాదాల ప్రస్తావన అన్ని వ్యాసాల్లోనూ ఉండటమే దీనికి కారణం. అయితే, ఈ సందర్భంలోనే [...]