చిన్న వయసులోనే సౌండ్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన దాము కుమార్ (35) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై యశోద ఆసుపత్రిలో సోమవారం ఉదయం 10గంటలకు కన్నుమూసారు. ఆయన వయసు 35సంరాలు, అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి మంగళవారం చెన్నైలో అంత్యక్రియలు జరిపారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
‘శివ’,'పెదరాయుడు’,'క్షణక్షణం’, ‘నిన్నే పెళ్ళాడతా’, ‘ఆది’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’, ‘పెళ్లైన కొత్తలో’ వంటి అనేక చిత్రాలకు దాము సౌండ్ ఎఫెక్ట్స్ను సమకూర్చారు.ఆయన చివరిగా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన చిత్రం `శశిరేఖా పరిణయం’. తెలుగు సినిమా రంగానికి విశేష సేవలను అందించిన దాము కుమార్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. వృత్తి పరంగానే కాక వ్యక్తిగతంగానూ గొప్ప వ్యక్తిగా పేరుతెచ్చుకున్న దాము మరణానికి నవతరంగం శ్రధ్ధాంజలి ఘటిస్తూ…ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తోంది.
shree says:
35 సంవత్సరాలకే చని పోవడం నిజంగ దురద్రుస్టకరం….
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
అయ్యో! కొత్త సంవత్శరం మొదటి వారంలోనే చలనచిత్రసీమ ఒకప్రజ్ఞావంతుడిని కోల్పోయిందా??
దాము కుటుంబసభ్యులకు నాహృదయపూర్వక సానుభూతి
నిషిగంధ says:
అయ్యో! చాలా చిన్న వయసు!!!
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి..
parimalam says:
దాము కుమార్ కు ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధిస్తూ,ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి..