కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు న చిత్రోత్సవాల నిర్వహణ గురించి మాట్లాడుతూ “ఉత్తమ విలువలు కలిగిన సినిమాలు ప్రదర్శించడం.ఔత్సాహికుల్ని ప్రోత్సాహించదం సాంస్కృతిక బాధ్యత” అని ప్రముఖ దర్శకులు బి.నరసింగ రావు అన్నారు.కరీంనగర్ చిత్రోత్సవాన్ని అయన ప్రారంభిచారు.మహానగరాలకు దూరంగా నాన్ మెట్రొ నగరంలొ చిత్రొత్సవం జరగడం ముదావాహం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ యం. వి. సత్యనారాయణ ఫిల్మ్ సొసైటి వెబ్సైట్ ప్రారంభించారు.ఫిలింభవన్ కు ఎ సి వసతి కల్పిస్తామని చెప్పారు ఫెస్టివల్ డైరెక్టర్ వారాల ఆనంద్ మాట్లాడుతూ ఈ సంధర్బంగా యాభై కి పైగా చిత్రాల్ని ప్రదర్శిస్తున్నట్టుగా చెప్పారు. తర్వాత తనికెల్ల భరణి చిత్రం సిరా తో ప్రదర్శన ఆరంభమైంది.
ఫేస్ బుక్ కామెంట్స్